మరో కురుక్షేత్రం...

ఆయన లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో చోటు చేసుకుంటోన్న మార్పులు, విపరీత ధోరణిపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలకు ఇలాంటి రాజకీయాలు ఏ మాత్రం మంచివి కావని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌ లో క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ, ఇక్ఫాయ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ స్వర్గీయ ఎస్ జైపాల్ రెడ్డి డెమాక్రసీ అవార్డును ప్రముఖ రచయిత మోహన్ గురుస్వామికి అందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ధన ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక స్ఫూర్తికి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు. ధన ప్రభావం తగ్గి విలువలతో కూడిన సిద్ధాంతపరమైన రాజకీయాలు ఉండాలని చెప్పారు. సిద్ధాంతపరమైన రాజకీయాలు కాకుండా ఎవరెంత వేగంగా డెలివరీ చేస్తారన్న 'స్విగ్గీ పాలిటిక్స్' తెరమీదకొచ్చాయని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర పరిణామమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో సిద్ధాంతపరమైన విద్యార్థి రాజకీయాలు రావలసిన అవసరం ఉందని అన్నారు. జైపాల్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా... వివిధ హోదాల్లో ప్రాతినిధ్యం వహించి సుదీర్ఘంగా సిద్ధాంతపరమైన రాజకీయాలు చేశారని గుర్తు చేశారు. 1984లో పార్లమెంట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి 35 ఏళ్లు వెనుదిరిగి చూడకుండా దేశ రాజకీయాల్లో రాణించారని, దీనికి కారణం.. విలువలు, సిద్ధాంతాలే కారణమని పేర్కొన్నారు.

కొత్త రేషన్ కార్డు దారులకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు తీసుకుంటున్న వారికి శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. కొత్తగా రేషన్ కార్డులు తీసుకునేవారు ప్రభుత్వ పథకాలను ఇప్పటివరకు అందక ఇబ్బందులు పడుతున్న వారు, సంక్షేమ పథకాల కోసం ఎవరిని సంప్రదించాలో దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలో తెలియని వారికి శుభవార్త చెబుతోంది. సంక్షేమ పథకాలకు రేషన్ కార్దులే ప్రామాణికం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కొనసాగిస్తోంది. ఎంతోకాలంగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారు ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంది.

కొత్త రేషన్ కార్డులు తీసుకునే వారికి స్పెషల్ డ్రైవ్... సంక్షేమ పథకాలు కావాలని కోరుకునేవారు రేషన్ కార్డు ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి, చేయూత వంటి పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు తీసుకుంటున్న వారి కోసం ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించాలని భావిస్తుంది. అధికారులే నేరుగా వారి ఇళ్ళకు వెళ్లి వివరాల నమోదు... దీనిద్వారా సంక్షేమ పథకాలను మరింత సులభతరం చేసి సామాన్యులకు అందించే ప్రయత్నం చేస్తుంది. ప్రతి పథకంతో పాటు, ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సలకు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో కొత్తగా రేషన్ కార్డులు పొందినవారికి ప్రభుత్వ పథకాలను అందించడానికి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అధికారులు నేరుగా లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి వివరాలను నమోదు చేసుకొని అర్హత ఉన్న పథకాలను వారికి అందించే అవకాశం ఉంది. 30 లక్షల మందికి పైగా లబ్ధి... రాష్ట్రవ్యాప్తంగా దీనికోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడంతో కొత్త రేషన్ కార్డులు తీసుకున్న 30 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా కొత్త రేషన్ కార్డు దారులకు ఇబ్బంది కలగకుండా వారికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం నిజంగా వారికి శుభవార్త.

నేడు తెలంగాణ కేబినెట్‌.. గోశాల పాలసీపై నిర్ణయం..!

తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ ఈరోజు సచివాలయంలో సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగబోయే ఈ భేటీ పలు కీలక అంశాలపై చర్చించనుంది. ముఖ్యంగా గోశాల పాలసీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. అలాగే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. గిగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బిల్లుకు సంబంధించి మంత్రివర్గం చర్చించనుంది. అదేవిధంగా ప్రైవేట్‌ క్యాబ్‌ సేవలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడంపైనా కేబినెట్‌లో చర్చ జరగబోతోంది. కులగణన ప్రక్రియపై మంత్రివర్గం సమీక్షించనుంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, యూరియా నిల్వల పరిస్థితి, సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చ జరగనుంది. కాళేశ్వరంపై నివేదిక అందితే దానిపైనా చర్చించే అవకాశం ఉంది. అలానే రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా మత్స్యకార సహకార సంఘాల ఇన్‌ఛార్జ్‌ల నియామకంపై కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది..