మరో కురుక్షేత్రం...

జలపాతం చూసేందుకు అడవిలోకి వెళ్లి చిక్కుకున్న వరంగల్ నిట్ విద్యార్థులు.. కట్ చేస్తే జరిగిందిదే

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం మహిత పురం వాటర్ ఫాల్స్ వద్ద వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్లిన వరంగల్ ఎన్ఐటి కి చెందిన విద్యార్థులు అటవీ మార్గంలో దారి తప్పి అక్కడే చిక్కుకుపోయిన సంఘటన చోటుచేసుకుంది. గూగుల్ మ్యాప్ చూపించిన మార్గాన్ని అనుసరిస్తూ వెళ్లినవారు దట్టమైన అడవిలో చిక్కుకుని పోయారు. మహితాపురం జలపాతం చూడాలని వెళ్ళిన ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆ తర్వాత కమ్ముకున్న చీకటిలో అడవిలో సిగ్నల్ లేక ఇబ్బంది పడుతూ చివరకు 100కు డయల్ చేసి సహాయం కోసం అర్ధించారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. వరంగల్ ఎన్ఐటి కి చెందిన మూడవ సంవత్సర ఇంజనీరింగ్ విద్యార్థులు ఏడుగురు అటవీ శాఖ పర్యటకుల సందర్శన నిషేధించిన మహితాపురం జలపాతానికి శనివారం సాయంత్రం బొల్లారం మీదుగా జలపాతానికి వెళ్లారు. భారీ వర్షాల కారణంగా చీకటి పడటంతో దారి తప్పిపోయారు. ఈ జలపాతాలకు సందర్శన అనుమతులు లేవు.. వెళ్లొద్దు ప్రస్తుతం ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతాన్ని మాత్రమే పర్యటకులకు సందర్శనకు అధికారులు అనుమతులు ఇచ్చారు.కాగా వీరభద్రవరం, మహితాపురం, కొంగాల జలపాతాలకు పర్యాటకుల సందర్శన అటవీ శాఖ నిషేధించింది. కనుక నిషేధిత జలపాతాల దగ్గరకు వెళ్ళకుండా ఉంటేనే మంచిది.

నిమిష ప్రియ మరణశిక్షలో బిగ్ ట్విస్ట్

అంతర్జాతీయంగా సంచలనం రేపుతోన్న కేరళ నర్సు నిమిషా ప్రియ మరణశిక్ష కేసు అనూహ్య మలుపు తీసుకుంది. ఆమెకు ఊరట లభించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తేలింది. ఆమెకు విధించిన మరణ శిక్షను యెమెన్ రద్దు చేసినట్లుగా ఎటువంటి అధికారిక సమాచారం లేదని చెబుతున్నారు. తొలుత- నిమిషా ప్రియా మరణ శిక్షను యెమెన్ రద్దు చేసినట్లు ఇండియన్ గ్రాండ్ ముఫ్తీ ఏపీ అబుబకర్ ముసలియార్ కార్యాలయం వెల్లడించింది. నిమిషా ప్రియ మరణశిక్షను రద్దు చేయాలని యెమెన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపింది. దీనిపై ఇంకా ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం అందాల్సి ఉందని పేర్కొంది. కాగా- నిమిష ప్రియ కేసు గురించి తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందని యెమెన్ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం యెమెన్ ప్రభుత్వం తీసుకోలేదని సమాచారం. మరణ శిక్ష రద్దయినట్లు ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలు నిరాధారమైనవని విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేశాయి. నిమిషా ప్రియ.. కేరళకకు చెందిన మహిళ. పాలక్కాడ్ ఆమె స్వస్థలం. 2008లో ఉపాధి కోసం యెమెన్ వెళ్లారు. అక్కడ మహదీతో కలిసి క్లినిక్ ప్రారంభించారు. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు తలెత్తాయి. తలాల్ తనను వివాహం చేసుకున్నాడని, వేధిస్తున్నాడని నిమిషా ఆరోపించారు. అంతే కాకుండా పాస్‌పోర్ట్‌ను కూడా లాక్కున్నాడని తెలిపారు. 2017లో తలాల్‌ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మత్తు మందు ఇచ్చి పాస్‌పోర్ట్ తిరిగి తీసుకోవడానికి నిమిషా ప్రయత్నించారని, డ్రగ్స్ డోస్ ఎక్కువ అవడం వల్ల అతను మరణించాడని యెమెన్ అధికారులు తెలిపారు. ఈ కేసులో నిమిషాను అరెస్టు చేసి 2018లో హత్య కేసులో దోషిగా నిర్ధారించారు.

ఆమెకు విధించిన ఉరిశిక్షను అప్పట్లో మే 16న అమలు చేయాల్సి ఉండగా, వాయిదా వేశారు. దీనిపై భారత ప్రభుత్వం తరపున పలు ప్రయత్నాలు జరిగాయి. నిమిషాకు తొలుత జూలై 16న ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. 2020లో ఆమెకు మరణ శిక్ష విధించగా, 2023లో ఆమె చివరి అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది.