మరో కురుక్షేత్రం...

మరో కురుక్షేత్రం...

ఇంజనీరింగ్ అద్భుతం.. అత్యంత ఎత్తైన రైల్వే చినాబ్ బ్రిడ్జి..!

ఇంటర్నెటెస్క్: శతాబ్దపు కల నేటితో సాకారమైంది. ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే ఆర్చి బ్రిడ్జి అయిన చినాబ్ ఉక్కు వంతెన (Chenab bridge)ను ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం ప్రారంభించారు. కట్గా నుంచి కశ్మీర్కు వందేభారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ఆ వంతెన అందుబాటులోకి వచ్చింది. అత్యంత దుర్లభమైన శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీర్ లోయకు రైలును నడపాలన్న బ్రిటీష్ కాలం నాటి ప్రణాళిక ఇప్పటికి కార్యరూపం దాల్చింది. అలాగే కటాలో రూ.46వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించారు. కట్ఢా-శ్రీనగర్ మధ్య రైలుకు ఆయన జెండా ఊపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెన (కేబుల్ బ్రిడ్జి)ను కూడా ప్రారంభించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని జమ్మూకశ్మీర్ పర్యటించడం ఇదే తొలిసారి. ఉధంపుర్లోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో దిగిన మోదీ.. వంతెన ప్రారంభానికి ముందు దానిని పరిశీలించారు. అలాగే జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. ఈ సందర్భంగా చినాబ్, అంజీ వంతెనలపై పరుగులు తీసిన వందేభారత్ రైలులో మోదీ ప్రయాణించారు. అనంతరం మోదీ కటాఢాలో బహిరంగ ర్యాలీలో పాల్గొంటారు. ఉగ్రదాడి నేపథ్యంలో భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించారు.

ఆపరేషన్ సింధూర్ లో మరిన్ని షాకింగ్ నిజాలు..! బయటపెట్టిన కేంద్రం..!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఇందులో భాగంగా తొలుత ఉగ్ర శిబిరాలతో ప్రారంభించి అనంతరం పాకిస్తాన్ మిలటరీ బేస్ లను, క్షిపణి రక్షణ వ్యవస్థలను సైతం దెబ్బతీసిన భారత్ ఆ వివరాల్ని పూర్తిగా వెల్లడించడంలో మాత్రం ఎందుకో తడబడుతోంది. ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత కూడా పాకిస్తాన్ కు తాము చేసిన నష్టాన్ని దేశ ప్రజలకు తెలియజేయడంలో గోప్యత పాటిస్తున్న కేంద్రానికి పాకిస్తాన్ తాజాగా షాకిచ్చింది.

భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ఆ దేశం చెబుతున్న దాని కంటే తాము చాలా ఎక్కువగా నష్టపోయామని పాకిస్తాన్ ఈ మధ్యే వివరాలు బయటపెట్టింది. దీంతో భారత్ ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కు జరిగిన నష్టాల్ని కేంద్రం బయటపెట్టింది. ఇందులో పాకిస్తాన్ యుద్ధ విమానాలతో పాటు మిస్సైళ్లు, డ్రోన్లను తాము ఏ స్ధాయిలో కూల్చేసిందీ వెల్లడించింది.