మరో కురుక్షేత్రం...

మరో కురుక్షేత్రం...

అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిరిండియా విమానం- 242 మంది ప్రయాణికులు..!

అహ్మదాబాద్ లో దిగ్బ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ విమానం కుప్పకూలింది. అది- ఎయిరిండియాకు చెందిన విమానంగా ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాద సమయంలో విమానంలో 133 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న మెఘానీ నగర్, షాహిబాగ్ వద్ద కుప్పకూలింది. ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న మెఘానీ నగర్, షాహిబాగ్ వద్ద కుప్పకూలింది. సమాచారం అందిన వెంటనే రాష్ట్ర విపత్తు నిర్వహణ-అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. విమాన శకలాలు జనావాసాల మీద పడటం వల్ల మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియా విమానం అది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలింది. పెద్ద శబ్దం చేస్తూ.. నిప్పు కణికలా నేలకు రాలింది. ఆ వెంటనే దట్టమైన పొగ వెలువడింది. సంఘటన స్థలంలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. అగ్నిమాపక వాహనాలు, అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్ మోతలతో ఆ ప్రాంతం అంతా మార్మోగిపోయింది. సమాయక చర్యలు అందజేయడానికి సంఘటన స్థలానికి స్థానికులు పరుగులు తీశారు. అందుబాటులో ఉన్న వాహనాలను క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడాని వినియోగించారు.

మరో కురుక్షేత్రం న్యూస్ ఈ సమావేశం వివరాలను మీకు అందించింది.

Sk.Islamuddin

తెలంగాణలో ఊపందుకుంటున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం – సీఎం రేవంత్ రెడ్డి!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం రాష్ట్రవ్యాప్తంగా వేగంగా అమలవుతోంది. ఈ పథకం ద్వారా పేదలకు తక్కువ ఖర్చుతో స్వంత ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం పూనుకుంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లను నిర్మించేందుకు లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, లబ్ధిదారులకు ₹5 లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు విడతలుగా అందిస్తోంది. భూమిలేని చెంచు గిరిజనుల కోసం ప్రత్యేక కేటాయింపులు చేయడం, ఇసుకను ఉచితంగా సరఫరా చేయడం వంటి చర్యలు పథకాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చాయి. ఇందిరమ్మ హౌసింగ్ మొబైల్ యాప్‌ను ప్రారంభించి, లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం, ఈ పథకాన్ని గృహరహితులకు వాసస్థల కలను సాకారం చేసే సాధనంగా మలుస్తోంది.

అలాగే, ప్రభుత్వ ఉద్యోగులు వేతన సవరణలు, పెండింగ్ బకాయిలు వంటి డిమాండ్లతో సమ్మెకు సిద్ధమవుతున్న సందర్భంలో, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించారు. "నన్ను ముక్కలుగా చేసినా, డిమాండ్లను తీర్చడానికి డబ్బు లేదు" అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సమ్మెలు కాకుండా, ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు .

ఆపరేషన్ సింధూర్ లో మరిన్ని షాకింగ్ నిజాలు..! బయటపెట్టిన కేంద్రం..!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఇందులో భాగంగా తొలుత ఉగ్ర శిబిరాలతో ప్రారంభించి అనంతరం పాకిస్తాన్ మిలటరీ బేస్ లను, క్షిపణి రక్షణ వ్యవస్థలను సైతం దెబ్బతీసిన భారత్ ఆ వివరాల్ని పూర్తిగా వెల్లడించడంలో మాత్రం ఎందుకో తడబడుతోంది. ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత కూడా పాకిస్తాన్ కు తాము చేసిన నష్టాన్ని దేశ ప్రజలకు తెలియజేయడంలో గోప్యత పాటిస్తున్న కేంద్రానికి పాకిస్తాన్ తాజాగా షాకిచ్చింది.

భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ఆ దేశం చెబుతున్న దాని కంటే తాము చాలా ఎక్కువగా నష్టపోయామని పాకిస్తాన్ ఈ మధ్యే వివరాలు బయటపెట్టింది. దీంతో భారత్ ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కు జరిగిన నష్టాల్ని కేంద్రం బయటపెట్టింది. ఇందులో పాకిస్తాన్ యుద్ధ విమానాలతో పాటు మిస్సైళ్లు, డ్రోన్లను తాము ఏ స్ధాయిలో కూల్చేసిందీ వెల్లడించింది.