మరో కురుక్షేత్రం...

వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో క్లౌడ్ బరస్ట్.. ఎమర్జెన్సీ నెంబర్లు ఇవే..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షం కురుస్తుందని వెల్లడించింది. ఇక హైదరాబాదులో క్లౌడ్ బరస్ట్ ఏర్పడినట్టు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఫోన్ చేసి పరిస్థితి పైన సమీక్షించారు. భారీ వర్షాలకు హైదరాబాద్ కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అప్రమత్తమైన ప్రభుత్వం భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది. వర్షాల కారణంగా ప్రజలకు తలెత్తే ఇబ్బందులను కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు చేసిన వెంటనే అధికారుల సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారని పేర్కొంది. కంట్రోల్ రూమ్ నెంబర్లకు కాల్ చెయ్యండి: కలెక్టర్ హరి చందన వర్షాల కారణంగా ఇళ్లల్లోకి నీళ్ళు చేరడం, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడం, విద్యుత్ సమస్యలు తలెత్తితే ప్రజలు కంట్రోల్ రూమ్ నెంబర్లు 040 2302813 లేదా 7416687878కు కాల్ చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన సూచించారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. భారీ వర్షాలతో, వరద ముంచెత్తిన ప్రాంతాలలో హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హరిచందన ఆదేశించారు.

మరో కురుక్షేత్రం న్యూస్ ఈ సమావేశం వివరాలను మీకు అందించింది.

Sk.Islamuddin

సికింద్రాబాద్ నుంచి ఈ రైళ్లూ మళ్లింపు, పునరుద్దరణ అప్పుడే..!!

దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనుల కారణంగా ఇప్పటికే ఇక్కడ నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లను చర్లపల్లి నుంచి కొనసాగుతున్నాయి. కాగా, కొన్ని ప్రధాన రైళ్లను మాత్రం సికింద్రాబాద్ నుంచి రాకపోకలు కొనసాగి స్తున్నాయి. అయితే, ఇప్పుడు రైల్వే అధికారులు మరిన్ని రైళ్లను సికింద్రాబాద్ నుంచి మార్పు చేసారు. ఇతర స్టేషన్ల నుంచి మళ్లింపు చేసారు. ఈ మేరకు రైల్వే అధికారులు స్పష్టత ఇచ్చారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నందున వేర్వేరు ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చే పలు రైళ్లను అక్టోబరు 19వ తేదీ వరకు ఇతర స్టేషన్లకు మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. తిరిగి అదే స్టేషన్‌ నుంచి రైళ్లు బయలుదేరుతాయని ఓ ప్రకటనలో వెల్లడించారు. విజయవాడ నుంచి వెళ్లే (12713, 12714) రైళ్లు కాచిగూడ స్టేషన్‌కు, పోరుబందర్‌ నుంచి (వీక్లీ) వచ్చి వెళ్లే (20967, 20968) రైళ్లు ఉందానగర్‌కు, సిద్దిపేట నుంచి వచ్చి వెళ్లే (77656, 77653, 776754, 77655) రైళ్లను మల్కాజ్‌గిరికి మళ్లించినట్టు అధికారులు వివరించారు. రాకపోకలు ఇదే రూటులో ఉంటాయని వెల్లడించారు.

అదే విధంగా పుణె నుంచి వచ్చి వెళ్లే (12025, 12026) రైళ్లు హైదరాబాద్‌ స్టేషన్‌ నుంచి.. మణుగూరు (12745, 12746) రైళ్లు, రేపల్లె నుంచి వచ్చి వెళ్లే (17645, 17646) రైళ్లు చర్లపల్లి నుంచి నడుస్తాయన్నారు.. దూర ప్రాంతాలకు వారానికోసారి, రెండు, మూడు సార్లు నడిచే పలు రైళ్లు.. సిల్చార్‌ (12513, 12514), దర్భంగ (17007, 17008), యశ్వంత్‌పూర్‌ (12735, 12736) రైళ్లు చర్లపల్లి నుంచి.. అగర్తల (07029, 07030), ముజఫర్‌పూర్‌ (05293, 05294), సంత్రాగచి (07221, 07222), దనపూర్‌ (07647, 07648), రామేశ్వరం (07695, 07696), హైదరాబాద్‌ రాక్సౌల్‌ (07051, 07052) రైళ్లు చర్లపల్లి టెర్మినల్‌ నుంచి నడుస్తాయని రైల్వే అధికారులు వివరించారు.

పిల్లలను ఇష్టం లేని కోర్సులలో చేర్పిస్తున్నారా? ఈ కన్నీటి కథనం మీ కోసమే..

చాలామంది చదువు విషయంలో పిల్లల పైన విపరీతమైన ఒత్తిడిని తెస్తూ ఉంటారు. ఇదే చదవాలి అదే చదవాలి అని వారి కోరికలను పిల్లలపైన రుద్దుతూ ఉంటారు. అలా ఇష్టం లేని చదువులను పిల్లలతో చదివించాలి అనుకునే వారికి హెచ్చరిక. మీ పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల జీవితం బాగుండాలి అనుకుంటే పొరపాటున కూడా అటువంటి ప్రయోగాలు చేయకూడదని, పిల్లలను బలవంతపు చదువులు చదివించకూడదని చెబుతున్నారు మానసిక నిపుణులు. సూసైడ్ నోట్ రాసి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య ఒకవేళ బలవంతపు చదువులు చదివిస్తే ఏం జరుగుతుందో తాజాగా జరిగిన ఒక ఘటన అందరికీ కనువిప్పుగా మారిందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పించే విషాదకరమైన ఆ ఘటన ఏమిటంటే.. హన్మకొండ జిల్లాలో 16 సంవత్సరాల ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హనుమకొండ నయీం నగర్ లోని ఓ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మిట్టపల్లి శివాని ఆత్మహత్యకు ముందు ఒక లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది.