
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుమల అన్నప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించటం ఆనందదాయకంగా ఉందని వ్యాఖ్యానించారు. అన్నప్రసాదాన్ని చాలా చక్కని రుచితో పాటు శుచిగా చేస్తున్నారని ప్రశంసించారు. నిత్యం వేలాది మంది భక్తులకు స్వామివారి అన్నప్రసాదం అందజేస్తున్నఈ కేంద్రం నిర్వహణా బృందానికి అభినందనలు తెలిపారు. ఈ స్పూర్తిని అన్ని ఆలయాలు ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో మరి కొన్ని కీలక సూచనలు టీటీడీ అధికారులకు చేసారు. శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలను ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలతో పాటు భక్తుల సౌకర్యాల కల్పనకు మాత్రమే వినియోగించాలని వెంకయ్య నాయుడు సూచించారు. అదే విధంగా తిరుమలకు దర్శనం కోసం వచ్చే వీఐపీల విషయంలోనూ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రతి ఊరిలో ఓ గుడి, బడి ఉండాలని కోరారు. ప్రతి గ్రామంలో ఓ ఆలయాన్ని ఏర్పాటు చేయడా నికి టీటీడీ లాంటి ధార్మిక సంస్థలు ముందుకు రావాలని సూచించారు. బడులను ఏర్పాటు చేయడం ప్రభుత్వ కర్తవ్యమని ఉద్ఘాటించారు. వీఐపీలు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే స్వామివారి దర్శనానికి రావాలని పేర్కొన్నారు. టీటీడీ అధికారులు సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందు కు సహకరించాలని కోరారు. ప్రజాప్రతినిధులు ఈ విధానాన్ని తప్పకుండా పాటించాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. తిరుమలలో సేవలు అందిస్తున్న శ్రీవారి సేవలకుతోనూ వెంయ్య మాట్లాడారు. వారు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. వారి సేవలను వెంకయ్య ప్రశంసించారు.
మరో కురుక్షేత్రం న్యూస్ ఈ సమావేశం వివరాలను మీకు అందించింది.
Sk.Islamuddin

పుతిన్ కాచుకో.. ఇంకో 10 రోజులే.. ట్రంప్ సంచలన వార్నింగ్..
రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడేళ్లకు పైగా భీకర యుద్ధం సాగుతూనే ఉంది. ఇటీవల వందలకొద్దీ డ్రోన్ లు, మిసైల్స్ తో ఉక్రెయిన్ పై తీవ్ర స్థాయిలో దాడులకు పాల్పడింది. ఇటీవల ఉక్రెయిన్ పై 728 డ్రోన్ లు,13 మిసైల్స్ తో మారణహోమం సృష్టించింది. గత మూడేళ్లలో అదే అతి పెద్ద దాడి కావడం గమనార్హం. అంతేకాకా ఓ సారి 550 డ్రోన్ లు, 11 మిసైల్స్ తో విధ్వంసం సృష్టించింది. అంతకుముందు 477 డ్రోన్ లు, 60 మిసైల్స్ లో భీకర దాడులు చేసింది రష్యా. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల రష్యాకు 50 రోజుల అల్టిమేటం ప్రకటించారు. 50 రోజుల్లో ఉక్రెయిన్ తో శాంతి చర్చలు జరపాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే తాజాగా ఆ గడువును 10 లేదా 12 రోజులకు ట్రంప్ కుదించారు. పుతిన్ నుంచి ఎలాంటి పురోగతి రావడం లేదని ఇక సమయం ఇచ్చి లాభం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో తాను అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. రెండు వారాల క్రితం ట్రంప్.. పుతిన్ కు 50 రోజుల డెడ్ లైన్ విధించారు. ఈ లోపు ఉక్రెయిన్ తో చర్చలు జరపాలన్నారు.