మరో కురుక్షేత్రం...

ప్రభుత్వ హాస్టల్‌లో గర్భవతులైన ఇద్దరు బాలికలు .కారణం ఎవరో తెలుసా..?

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, కామాంధుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. పసిపాపల నుంచి పండు ముసలివాళ్ల వరకు ఎవరినీ వదలడం లేదు. తాజాగా, ఒడిశాలో వెలుగు చూసిన ఓ దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అభం శుభం తెలియని, ఆర్థికంగా వెనుకబడిన స్థితిలో హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న ఇద్దరు మైనర్ బాలికలు అత్యాచారానికి గురై గర్భం దాల్చినట్లు సాధారణ ఆరోగ్య పరీక్షల్లో తేలింది. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో ప్రభుత్వ హాస్టళ్లలో నిర్వహించిన ఆరోగ్య తనిఖీలలో ఈ షాకింగ్ నిజం బయటపడింది. వేసవి సెలవుల తర్వాత బాలికలు తమ హాస్టళ్లకు తిరిగి వచ్చినప్పుడు గర్భాలు దాల్చినట్లు గత నెలలో వెలుగులోకి వచ్చింది. శానిటరీ నాప్‌కిన్‌ల కోసం హాస్టల్ మ్యాట్రన్ వద్దకు వెళ్లకపోవడంతో అనుమానం వచ్చి వైద్య పరీక్షలు చేయించగా, ఈ దారుణం వెల్లడైంది. వెంటనే హాస్టల్ అధికారులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, బాలికలను మాయమాటలతో ప్రెగ్నెంట్ చేశారా, లేదా వారి ఇష్టంతోనే జరిగిందా అనే కోణంలో లోతుగా విచారణ చేపట్టారు. పెరిగిపోతున్న దాడులు: బాలసోర్‌లో మరో ఘోరం... మరోవైపు, ఇలాంటి దారుణాలు ఒడిశాలో సర్వసాధారణంగా మారాయి. బాలసోర్ జిల్లాలోని బర్హంపూర్ పోలీసులు తాజాగా నలుగురు యువకులను అరెస్టు చేశారు. గ్రామంలోని చెరువు దగ్గర 20 ఏళ్ల మహిళపై అత్యాచారయత్నం చేసి విఫలమైన ఆ కామాంధులు, బండరాయితో ఆమె తల పగలగొట్టి చంపడానికి ప్రయత్నించారు. ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో అక్కడి వారు రావడంతో ప్రాణాలు దక్కాయి. ఈ వరుస ఘటనలతో ఒడిశాలో మహిళలు, బాలికల భద్రతపై ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు.

తెలంగాణ వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఛార్జీలు పెంపు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వాహనదారులకు భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలోని రవాణాశాఖలో సర్వీసు ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త ఫీజులను ప్రకటించింది. అయితే ఎలాంటి బహిరంగ ప్రకటన లేకుండానే ఈ మార్పు అమల్లోకి వచ్చింది. రవాణాశాఖ అధికారులు ఇందుకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్ సైట్ లో ఉంచారు. వీటిల్లో ఫైనాన్స్ పై వెహికల్స్ తీసుకున్న వారికి హైపొథెకేషన్ ఫీజును రూ.2,135 నుంచి రూ.3,135కు పెంచారు. లెర్నర్స్ లైసెన్సు, డ్రైవింగ్ టెస్ట్ ఫీజుల ఛార్జీలు రూ.335 నుంచి రూ.440కి పెంచారు. టూవీలర్, కారు లెర్నర్స్ లైసెన్స్ ఫీజు రూ.450 నుంచి రూ.585కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక పర్మినెంట్‌ లైసెన్సుకు సంబంధించిన డ్రైవింగ్‌ టెస్టుకు గతంలో రూ.1,035 వసూలు చేసేవారు. దాన్ని తాజాగా రూ.1,135కు పెంచారు. వెహికల్ యాజమాన్య బదిలీ ఫీజు రూ.935 నుంచి రూ.1805కు పెంచారు. ఆటో రిక్షా డ్రైవింగ్ టెస్ట్ ఫీజును రూ.800 నుంచి రూ.900గా మార్చారు.