మరో కురుక్షేత్రం...

మరో కురుక్షేత్రం...

ప్రజల వద్దకే భూ పరిపాలన..!

తెలంగాణలో భూ పరిపాలన వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త చట్టం “భూభారతి” (Bhu Bharati) ప్రజలలో చైతన్యం కలిగిస్తోంది. ప్రజల వద్దకే భూ సమాచారం, భూమి హక్కుల పత్రాలు, పట్టాదారుల నిబంధనలు, భూముల సరిహద్దుల వివరాలు తేలికగా అందించేలా ఈ చట్టం రూపొందించబడింది. భూ పరిపాలనలో పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా ఈ చట్టం రూపొందించబడింది.

ఈ చట్టం అమలులో భాగంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఉన్న భూముల డేటాను ఒకే ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉంచనున్నారు. భూ రికార్డులు, డిజిటల్ మ్యాపులు, సర్వే డేటా—all ఒక్కే పోర్టల్ ద్వారా ప్రజలకు సులభంగా కనిపించనున్నాయి. దీని ద్వారా భూ వివాదాలు, డూప్లికేట్ రికార్డులు, అక్రమ రిజిస్ట్రేషన్లకు చెక్ పడనుంది.

భూభారతి చట్టం ద్వారా తెలంగాణ భూక్షేత్రంలో ఒక కొత్త దశ ప్రారంభమైంది. ఈ చట్టాన్ని అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో భూముల నిర్వహణలో అవినీతి తగ్గి, వ్యవసాయ భూముల భద్రత, రైతుల న్యాయ హక్కులు బలపడతాయని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించగా, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.

భూ సమాచారాన్ని మొబైల్‌ యాప్, పోర్టల్ ద్వారానే తెలుసుకునే వీలును కల్పించడం ద్వారా ప్రజల సమయాన్ని, ఖర్చును ఆదా చేయగలుగుతారు. భూభారతి చట్టం అనేది తెలంగాణలో భూ పరిపాలనలో జరిగిన క్రాంతికార పరిణామం అని పరిగణిస్తున్నారు.

రైతు భరోసాపై శుభవార్త.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు..!

తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే తెలంగాణ రైతన్నల ఖాతాలలో రైతు భరోసా పెట్టుబడి సాయం జమ చేసేందుకు రెడీ అవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా పెట్టుబడి సాయం మరో 10- 15 రోజుల్లో ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతోంది. రైతు భరోసా ఇప్పుడు ఇస్తే స్వామి కార్యం, స్వకార్యం రెండూ నెరవేరినట్టు అవుతుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు పడినట్టు అవుతుంది.రైతు భరోసా నిధుల సమీకరణ పై ప్రభుత్వం కసరత్తు రైతు భరోసా పంపిణీని త్వరలోనే పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రైతుల ఖాతాలలో వానాకాలం రైతు భరోసాను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది .ఈ క్రమంలోనే నిధుల సమీకరణ పైన దృష్టి సారించినట్లు సమాచారం. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ నుంచి 3 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు వేల కోట్ల రూపాయలకు తాజాగా ఇండెంట్ పెట్టినట్టు తెలుస్తోంది.

రైతు భరోసాగా రైతు బంధు పథకం పేరు ఈ నిధులన్నీ సమకూరిన తర్వాత రైతులకు వానకాలం పెట్టుబడి సహాయాన్ని అందించి ఆ తర్వాత స్థానికసంస్థల ఎన్నికలకు వెళ్లనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం రైతులకు రైతుబంధు పథకం కింద ఎకరానికి 5000రూపాయలు చొప్పున పంపిణీ చేయగా, ప్రతి సీజన్లోనూ రైతన్నలకు పెట్టుబడి సాయం అందించడం కోసం 7500కోట్ల రూపాయలు అవసరం అయ్యేవి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 2024 - 2025 సీజన్లో రైతుబంధు పథకం పేరును రైతుభరోసాగా మార్చింది.యాసంగిలో ఈ రైతులకే పెట్టుబడి సాయం 2023- 2024 యాసంగి సీజన్‌లో 1.52 కోట్ల ఎకరాలకు 7625 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. రైతుబంధును ప్రక్షాళన చేసేందుకు కొంత సమయం పడుతుందని ఇప్పటివరకు వానకాలం సీజన్లో రైతు భరోసా ఇవ్వలేదు. ఇక మొన్న యాసంగి సీజన్లో 57 లక్షల మంది 84 లక్షల ఎకరాలకు 5058 కోట్ల రూపాయలను మాత్రమే పంపిణీ చేసింది. నాలుగు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది.