ట్రంప్ బెదిరింపులు ఇకపై పని చేయవు.. సుంకాల భయానికి జడవని మార్కెట్!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై విధించిన 25 శాతం సుంకాలను 50 శాతానికి పెంచినప్పటికీ.. భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఈ వార్త వెలువడిన తర్వాత కూడా గురువారం నాటి ట్రేడింగ్లో భారతీయ షేర్ మార్కెట్, రూపాయి అస్థిరతకు గురికాకుండా స్థిరంగా ఉన్నాయి. అయితే ఈ అదనపు 25 శాతం సుంకం 21 రోజుల తర్వాత అమల్లోకి వస్తుందని ట్రంప్ ప్రకటించడం మార్కెట్కు కొంత తాత్కాలిక ఊరటనిచ్చింది. ఈ గడువులోగా భారత్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. విశ్లేషకుల అభిప్రాయం ఇలా "21 రోజుల గడువు భారతదేశానికి చర్చలు జరపడానికి, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ఒక అవకాశం. అయితే, వాణిజ్య భవిష్యత్తుపై అనిశ్చితి కొనసాగుతోంది, ఎందుకంటే రెండు దేశాలు ఎంతవరకు రాజీ పడతాయో స్పష్టత లేదు" అని అన్నారు. ట్రంప్ తన కఠిన వైఖరిని మార్చుకోకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. "భారతదేశానికి ఇది ఒక సవాలు, ఎందుకంటే చర్చలలో అమెరికా పైచేయి సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మార్కెట్లు వెంటనే భయపడకపోవచ్చు, కానీ వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా మార్కెట్ సెంటిమెంట్ స్వల్పకాలంలో బలహీనంగా ఉండే అవకాశం ఉంది" అని పేర్కొంటున్నారు. నిఫ్టీ 24,500-24,750 మధ్య కదలాడుతోంది. 24,500 కంటే దిగువకు పడితే, అది 24,300-24,250 వరకు పడిపోయే అవకాశం ఉంది. 24,760 కంటే పైన స్థిరపడితేనే మార్కెట్ పుంజుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఒప్పించిన నారా లోకేష్: ఆ టూర్ తో సత్ఫలితాలు...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. భారీగా పెట్టుబడులను సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా పారిశ్రామికవేత్తలు, వివిధ మల్టీ నేషనల్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో ముఖాముఖి సమావేశమౌతోన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను వారికి వివరిస్తోన్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్.. తాజాగా యూట్యూబ్ అండ్ టెస్సెరక్ట్ సంస్థల యాజమాన్యంతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారితో పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఏపీలో క్రియేటర్ అకాడమీని స్థాపించడం అవగాహన ఒప్పందాల ముఖ్య ఉద్దేశం.