
రాహుల్ గాంధీ ఇచ్చిన 'ఎవరెంతో వారికంత' అనే నినాదంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రకుల రెడ్డి సామాజిక వర్గాల నుండి వచ్చినప్పటికీ, వెనుకబడిన వర్గాలకు మద్దతుగా బీసీ రిజర్వేషన్లను ముందుకు తీసుకువస్తున్నందుకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలియజేశారు. ఢిల్లీ వేదికగా ఆమె బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ద్వంద్వ వైఖరి.. బీజేపీ పార్టీ తెలంగాణ గల్లీలలో మెప్పు కోసం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లులకు సంపూర్ణ మద్దతు ఇచ్చిందని, అయితే అదే బీజేపీ ఎంపీలకు ఢిల్లీలో ఆ బిల్లులను ఆమోదింపజేసే బాధ్యత లేదా అని సీతక్క ప్రశ్నించారు. అసెంబ్లీలో మద్దతు ఇవ్వడం అనేది కేవలం గల్లీ రాజకీయాల కోసమేనని, వారికి బీసీల ఆత్మగౌరవం, హక్కులు పట్టవని ఆమె అన్నారు. ఓట్ల కోసం కులాల మధ్య, వర్గాల మధ్య విభజన చేయడం తప్ప, సామాజిక న్యాయం కోసం బీజేపీ ఎప్పుడూ పని చేయదని సీతక్క ఆరోపించారు. రాహుల్ గాంధీపై ప్రశంసలు.. రాహుల్ గాంధీని యుగ పురుషుడు అని అభివర్ణిస్తూ, బీసీలకు రిజర్వేషన్లు పెరగాలని ఆయన పాదయాత్ర చేశారని సీతక్క ప్రశంసించారు. బీసీల హక్కులు, ఆత్మగౌరవం బీజేపీకి పట్టవని ఆమె అన్నారు. గల్లీలో ధర్నాలు చేయడం కాకుండా, దమ్ముంటే ఢిల్లీలో ధర్నాలు చేయాలని బీజేపీ నాయకులకు సవాలు విసిరారు.

ఏపీ ప్రభుత్వం మరో ఉచిత హామీ పథకం అమలు, రేపటి నుంచే..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు కు ఆదేశాలు జారీ అయ్యాయి. రేపు (గురువారం) నుంచే ఈ పథకం అమలు కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసారు. ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు ప్రారంభం కానుంది. దీనికి ముందే మరో హామీ అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. నేతన్నలకు చేయూత ఇచ్చేలా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. అదే విధంగా హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని సర్కారే భరించేలా సీఎం చంద్రబాబు ఆదేశించారు. మగ్గాలకు 200, పవర్లూమ్స్కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు. నేతన్నల కోసం ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం నుంచి నిర్ణయాలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు చేపట్టాల్సిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేలా సమీక్షలో నిర్ణయం వెల్లడించారు.
సీఎం ఆదేశాలు... ఇక, హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని చంద్రబాబు ప్రకటించారు. ఈ నిర్ణయాల వల్ల చేనేత రంగం పుంజుకుంటుందని తక్కువ ధరల్లో చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చేనేత కార్మికుల కోసం రూ.5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం నుంచి ఈ నిర్ణయాలను అమలు చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. ఏపీకి చెందిన చేనేత ఉత్పత్తులకు లభించిన 10 జాతీయ అవార్డులను అధికారులు సీఎం చంద్రబాబుకు నిర్దేశించారు. పవర్ లూమ్స్కు 500, హ్యాండ్లూమ్స్కు 200 యూనిట్ల వరకు ఇవ్వనుంది. ఈ మేరకు రూ. 125 కోట్లు ఖర్చు కానుంది.