
మహమ్మద్ సిరాజ్ మరోసారి తన సత్తా చాటాడు. ఒకానొక దశలో టీమిండియా ఓడిపోతుందనుకున్న మ్యాచ్ను తన అద్భుత బౌలింగ్తో మలుపు తిప్పి విజయం అందించాడు. ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసి, టీమిండియా విజయానికి ప్రధాన కారకుడయ్యాడు. అతని స్పెల్తో ఇంగ్లాండ్ ప్రధాన బ్యాట్స్మెన్లు సైతం క్రీజులో నిలవలేక చుక్కలు చూశారు. క్లిష్ట పరిస్థితుల్లో హీరోగా నిలిచిన సిరాజ్ మ్యాచ్ కీలక దశలో ఉన్నప్పుడు, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు భారత్పై ఒత్తిడి పెంచుతున్న సమయంలో సిరాజ్ బౌలింగ్ బాధ్యతలు స్వీకరించాడు. అతని ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, స్వింగ్, మరియు పేస్ ఇంగ్లీష్ బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టాయి. ముఖ్యంగా జెమీ స్మిత్, జెమీ ఓవర్టన్ వంటి కీలక బ్యాట్స్మెన్లను వెంటవెంటనే పెవిలియన్ పంపడం ద్వారా మ్యాచ్ గతిని మార్చేశాడు. అతని కట్టుదిట్టమైన బౌలింగ్ స్పెల్, కీలక వికెట్లు తీయడం ద్వారా ఇంగ్లాండ్ స్కోరు బోర్డుకు అడ్డుకట్ట వేసింది. టీమిండియాకు సిరాజ్ ఒక ఆయుధం సిరాజ్ ప్రదర్శన కేవలం ఈ మ్యాచ్కే పరిమితం కాదు. గత కొంతకాలంగా అతను భారత జట్టుకు ఒక నమ్మకమైన బౌలర్గా నిరూపించుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో వికెట్లు తీయగల సామర్థ్యం, దూకుడుగా బౌలింగ్ చేయగల నైపుణ్యం అతన్ని టీమిండియాకు ఒక కీలక ఆయుధంగా మార్చాయి. అందరూ నిరాశలో ఉన్నప్పుడు, సిరాజ్ తన బౌలింగ్తో ఆశలు చిగురింపజేసి, చివరికి విజయ తీరాలకు చేర్చాడు. ఈ విజయంతో టీమిండియాలో అతని పాత్ర ఎంత ముఖ్యమైనదో మరోసారి స్పష్టమైంది.
సైనికుల రక్తం కంటే చిల్లర ఎక్కువైందా ? భారత్-పాక్ ఆసియాకప్ మ్యాచ్ పై దుమారం..!
ఈ ఏడాది ఏప్రిల్ 22న కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడికి కారకులైన తీవ్రవాదుల్ని పెంచి పోషించిన పాకిస్తాన్ తో ఆసియాకప్ క్రికెట్ మ్యాచ్ కు భారత్ సిద్దం కావడంపై విమర్శలు మొదలయ్యాయి. ఆసియాకప్ టోర్నీలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఆడేందుకు బీసీసీఐ అంగీకరించడంపై పెను దుమారం రేగుతోంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలే ఇప్పుడు దీనిపై తీవ్ర విమర్శలకు దిగుతున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ లో పాకిస్తాన్ తో జరగాల్సిన వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో మ్యాచ్ ను భారత క్రికెటర్లు చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన వారికి మద్దతిస్తున్న పాకిస్తాన్ తో ఆడేది లేదని భారత సీనియర్ క్రికెటర్లు ఈ మ్యాచ్ ను బహిష్కరించారు. దీంతో చివరి నిమిషంలో ఈ మ్యాచ్ రద్దయింది. ఇప్పుడు మరోసారి ఆసియా కప్ టోర్నీలో మ్యాచ్ కు బీసీసీఐ ప్లాన్ చేయడంతో దీనిపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉద్ధవ్ సేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది.. సైనికుల రక్తం కంటే డబ్బులు ఎక్కువయ్యాయంటూ కేంద్రం తీరుపై మండిపడ్డారు. పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఎలాంటిదైనా, ఎక్కడ ఆడినా భారతీయులు వ్యతిరేకిస్తారని చెప్పారు. బీసీసీఐ ఈ మ్యాచ్ ను ఏ దేశంలో నిర్వహించినా భారతీయులు మాత్రం వ్యతిరేకిస్తారన్నారు. మ్యాచ్ జరిగే గ్రౌండ్ లో భారతీయులు నిరసన తెలుపుతారని హెచ్చరించారు. భారతీయులు, సాయుధ దళాల రక్తంతో లాభాలు సంపాదించుకోవడం ఆపాలని కోరారు. ఓవైపు భారతదేశ సీడీఎస్ ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని చెబుతుంటే, మరోవైపు మీరు మీ రక్త ధనాన్ని సంపాదించడానికి తొందరపడుతున్నారంటూ ఆమె వ్యాఖ్యానించారు.